సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
NEWS Aug 19,2026 10:19 pm
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. హనుమకొండలో వారు మీడియాతో మాట్లాడుతూ పిల్లకాకులు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని, సుస్మితకు కనీసం సభ్యత్వం కూడా లేదన్నారు. స్థాయిని మరిచి ఇలా మాట్లాడడం సరి కాదన్నారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.