మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన
NEWS Aug 15,2024 05:37 am
కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉపాసన కామినేని X వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిలో కనీస మానవత్వం ఉండడం లేదని, మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది అన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన.. ఈ రంగంలోని వర్క్ఫోర్స్ లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని చెప్పారు. ప్రతి మహిళకు భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు.