సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపన్న గౌడ్ త్యాగాలను స్మరించుకుంటూ, గౌడ, ఇతర కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం కొనియాడారు.