బంగ్లాదేశ్ హిందువుల భద్రతపై
140 కోట్ల మందిలో ఆందోళన: మోదీ
NEWS Aug 15,2024 05:28 am
బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలనే భారత్ కోరుకుంటుందని తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్కు అండగా ఉంటుందని వివరించారు.