ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
NEWS Sep 20,2026 09:43 pm
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన వాహనాలకు నిర్దేశించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో వాహనాలను నిల్పవద్దని ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.