38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
NEWS Sep 20,2026 09:13 pm
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జయరాజు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకున్నారు. భువనగిరిలో జరిగిన భారత్ రక్తదాన సేవ మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో నిర్వాహకులు జయరాజును సత్కరించి ఈ పురస్కారం అందజేశారు. అవార్డు అందుకున్న జయరాజును పలువురు అభినందించారు.