MGMలో భవనం పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
NEWS Sep 20,2026 09:12 pm
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న వరంగల్ ఏంజిఎంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ప్రమాదవశాత్తు స్లాబ్ పై పెచ్చులు ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ పాటు అటెండర్లు ఎల్లమ్మ,ఓంకార్ గాయపడ్డారు. గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. పాత భవనం కావడం పైకప్పు నుంచి నీరు లీకేజ్ అవ్వడం వల్ల పెచ్చులు ఉడి పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో ఆ వార్డులోని పేషంట్ల బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.