వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
NEWS Sep 19,2026 07:39 pm
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తిష్ట గణపతికి అర్చకులు పంచామృతాలు, షాడోపచార పూజ, లక్ష గరికల పూజ నిర్వహించారు. యాగశాలలో గణపతి నవగ్రహ, రుద్ర సహిత హోమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.