అంబేద్కర్ విగ్రహాలను రాజ్యాంగ ప్రతులను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవిపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలోని అంబేద్కర్ సెంటర్ లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఇటీవల కాలంలో అంబేద్కర్ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు.అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు.