ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే వేదికపై సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ బయోపిక్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై తొలి పరిచయం ఇచ్చింది. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలతో ఎంఎస్ సుబ్బులక్ష్మిని గుర్తు చేసేలా ఆమె కనిపించారు.