3వ టీ20లో భారత్ ఘన విజయం
NEWS Sep 17,2026 10:58 pm
దిల్లీ: అఫ్గానిస్థాన్తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. అభిషేక్ శర్మ 108 (34 బంతుల్లో), సంజు శాంసన్ 50 (35 బంతుల్లో) అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 221/7 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. ఇబ్రహీం (25) టాప్ స్కోరర్. నితీశ్ రెడ్డి 3, రవి బిష్ణోయ్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.