పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
NEWS Sep 17,2026 08:06 pm
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి రాజేందర్ వైద్యం కోసం 5 లక్షల విలువైన ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే నాగరాజు వారికి అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఆర్థిక భరోసా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.