ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
NEWS Sep 17,2026 12:28 pm
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఒక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో కడియం శ్రీహరి వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు,పంట మార్పిడిపై రైతులకు కల్పిస్తున్న అవగాహన వల్ల వరంగల్ జిల్లా రైతులు వరి, పత్తి వంటి పంటలకు బదులుగా పామాయిల్ సాగు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు.