మోదీ పుట్టినరోజున 'మోదీ కథ పుస్తకం
NEWS Sep 14,2026 07:07 pm
దిల్లీ: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ‘మోదీ కథ’ పుస్తకం విడుదల కానుంది. జర్నలిస్ట్, రచయిత హరీశ్ చంద్ర బర్నవాల్ రాసిన ఈ పుస్తకంలో గత 25 ఏళ్లలో మోదీ జీవితంలోని మానవీయ కోణాన్ని ప్రతిబింబించే 10 వాస్తవ గాథలను పొందుపరిచారు. రైలు ప్రయాణికులతో ఆయన వ్యవహరించిన తీరు, నేపాల్కు చెందిన జీత్ బహదూర్తో అనుబంధం, దృష్టిలోపం ఉన్న విద్యార్థిని పట్ల చూపిన సున్నితత్వం వంటి ఘటనలను ఇందులో వివరించారు. సామాన్యుల సుఖదుఃఖాల్లో మోదీ పాలుపంచుకున్న తీరును ఆవిష్కరించడమే పుస్తక ఉద్దేశమని ప్రచురణకర్తలు తెలిపారు. మోదీపై బర్నవాల్ రాసిన ఐదో పుస్తకం ఇది.