పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో సహజంగా,పర్యావరణహితంగా తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాల స్టాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. గత 12 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు శివ కుమార్ కలెక్టర్ కు వివరించారు. మట్టి విగ్రహాలను చాలా ఆకర్షణీయంగా తయారు చేశారని కలెక్టర్ ప్రశంసించారు.