‘బ్రిక్స్’ విందుపై రాహుల్ చురకలు
NEWS Sep 13,2026 05:24 pm
దిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ మండపంలో ప్రధాని మోదీ విదేశీ నేతల కోసం విందు ఏర్పాటు చేశారు. భారతీయ ప్రాంతీయ వంటకాల వైవిధ్యాన్ని పరిచయం చేసేలా పూర్తిగా శాకాహార మెనూను రూపొందించారు. ఖాండ్వీ మిల్లే-ఫెయ్, ఖుంబ్ గలౌటీ, పన్నీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, మిల్లెట్ పులావ్, బీట్రూట్ రాయితా, చిరుధాన్యాలు, రొట్టెలను వడ్డించారు. విందులో నాన్వెజ్ వంటకాలు లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘‘80% మంది భారతీయులు మాంసాహారులు. భారతీయ నాన్వెజ్ వంటకాలు రుచిగా ఉంటాయి’’ అని Xలో పేర్కొన్నారు.