ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
NEWS Sep 12,2026 11:03 pm
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్ చైర్మన్, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల ప్రతిమలనే ఉపయోగించడం మేలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సొసైటీ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్రెడ్డి, భీమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.