240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
NEWS Sep 13,2026 10:46 am
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్మసిన్కు వెళ్తుండగా నౌకతో రాడార్, రేడియో సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయాయి. నౌక ఏమైందనే విషయం అంతుచిక్కడం లేదు. చివరిసారిగా బంజర్మసిన్లోని ఓ రేవుకు సుమారు 92 మైళ్ల దూరంలో జావా సముద్ర జలాల్లో నౌక ఉన్నట్లు అధికారులు గుర్తించారు.