NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
NEWS Sep 12,2026 12:20 pm
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సురేష్ నాయక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.