అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
NEWS Sep 10,2026 10:39 am
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, రైతులకు అందుబాటులో ఉంటున్న ఆయనకే ఈసారి అవకాశం దక్కవచ్చని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదవి కోసం పలువురు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.