బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
NEWS Sep 08,2026 11:43 pm
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ ఎదుట చోటు చేసుకున్న ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు ఎంపీ ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల గౌరవం, భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా సిబ్బంది గౌరవం, భద్రతకు కఠిన రక్షణ కల్పించాలన్నారు.