ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
NEWS Sep 08,2026 07:06 pm
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. నిత్యం ఇక్కడి నుంచి ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని వెంటనే అధికారులు స్పందించి బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.