ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
NEWS Sep 08,2026 07:05 pm
హనుమకొండలోని సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టే త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గోదాంలో భద్రపరిచిన యంత్రాల భద్రత,స్ట్రాంగ్ రూముల పరిస్థితి,స్ట్రాంగ్ రూమ్ కు వేసి ఉన్న సీల్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.