వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
NEWS Sep 06,2026 10:52 pm
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పనీర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటువంటి యూనిట్ల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వినూత్న ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.