ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
NEWS Sep 06,2026 10:54 pm
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ సబ్ స్టేషన్ లో ఐదు ఎంవిఏ సామర్థ్యం ఉన్న అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ను విజయవంతంగా చార్జింగ్ చేశారు. దీంతో విద్యుత్ సిబ్బందిని సిఎండి అభినందించారు.సరఫరా సామర్థ్యం,నాణ్యత పెరగడంతోపాటు పెరుగుతున్న విద్యుత్ లోడ్ ను తీర్చేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించే దిశగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.