హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
NEWS Sep 06,2026 10:53 pm
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ‘సమరభేరి’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి ‘బాకీ కార్డులు’ అందజేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోగా, సజావుగా సాగుతున్న పాత పథకాల్లోనూ కోతలు విధించారని బాలకృష్ణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.