పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS Sep 06,2026 10:43 pm
కొండేపి: ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండేపి ఎస్ఐ త్యాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, ఆరుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ త్యాగరాజు మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.