ఎమ్మిగనూరు అభివృద్ధికి మరో ముందడుగు
రూ.303.38 లక్షల పనులకు భూమిపూజ
NEWS Sep 05,2026 09:03 pm
ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రూ.303.38 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీలు, పైప్లైన్, కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, పైప్లైన్ పనుల అనంతరం 24 గంటల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.