ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
NEWS Sep 04,2026 09:50 pm
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.