సైబర్ నేరాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 04,2026 09:49 pm
హనుమకొండలోని బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేయూ సహాయ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యా, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాభివృద్ధితో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.