ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Sep 04,2026 03:53 pm
రాయికల్: చింతలూరులో ముంజం భాగ్యలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపి, భాగ్యలక్ష్మికి చీర కానుకగా అందజేశారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ రమేష్ నాయక్, నాయకులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.