రెడ్డి సంఘాల దీక్షకు మండల నాయకుల పిలుపు
NEWS Sep 04,2026 02:05 pm
రాయికల్: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సెప్టెంబర్ 8న నిర్వహించనున్న రెడ్డి సంఘాల నిరసన దీక్షను విజయవంతం చేయాలని మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు చింతలపల్లి గంగారెడ్డి పిలుపునిచ్చారు. రాయికల్లో దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. రెడ్డి కార్పొరేషన్కు రూ.1,000 కోట్లతో పాలకవర్గం ఏర్పాటు చేయాలని, రైతు బీమా కొనసాగించాలని, బుద్వేల్లో రెడ్డి హాస్టల్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని తిరిగి కేటాయించాలని, అన్ని విభాగాల్లో EWS రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.