సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
NEWS Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి సంపత్ గౌడ్, మండల అధ్యక్షుడు సాయగౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మహిళా అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.