భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
NEWS Sep 03,2026 09:16 pm
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట సంబంధిత వారికి పరిహారాన్ని త్వరగా చెల్లించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. హన్మకొండ కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు.రహదారుల నిర్మాణాల కోసం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట సంబంధిత వారికి పరిహారాన్ని త్వరగా చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు.పెండింగ్ ఉన్నచోట సంబంధిత రైతులతో మాట్లాడి భూసేకరణను వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.