పాఠశాలలో ఘనంగా గోకులాష్టమి
NEWS Sep 03,2026 09:12 pm
రాయికల్: మండలంలోని ధరూర్ క్యాంప్ పీఎం శ్రీ పాఠశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.