గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సురేష్
NEWS Sep 03,2026 09:13 pm
ఒడ్డెలింగాపూర్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇంచార్జీ రేణిగుంట సాగర్, మండల నాయకులు బెక్కం వెంకటేష్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ MRPS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అధ్యక్షుడిగా మోర్తాడి సురేష్, ఉపాధ్యక్షులుగా సాయి, ప్రధాన కార్యదర్శులుగా రాజేశం, ఎం.నరేష్, ఈదుల లక్ష్మణ్, అధికార ప్రతినిధిగా అడ్లూరి దినేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో అనిల్, వెంకటేష్, సిపెల్లి రాజేందర్, గండ్లసాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.