22ఏ పై కరీంనగర్లో బీఆర్ఎస్ రాస్తారోకో
NEWS Sep 03,2026 04:20 pm
కరీంనగర్: 22ఏ నిషేధిత జాబితా నుంచి 6,000 ఎకరాల పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, సాగునీరు, యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.