రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
NEWS Sep 02,2026 11:27 pm
రవితేజ, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి గెటప్లో మణికంఠ, ఇరువైపులా రవితేజ, ప్రియా భవాని శంకర్ ఉన్న ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని, ‘ఇరుముడి’ జనరేషన్ బ్లాక్బస్టర్గా నిలిచిందని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది.