FFS యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి
NEWS Sep 02,2026 10:51 pm
రైతులు ఎరువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ను వినియోగించుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండల వ్యవసాయ అధికారి నవీన్ సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన యాప్ లో యూరియాతో పాటు డీఏపీ ఇతర కాంప్లెక్ ఏరువులను కూడా రైతు సోదరులు తమ ఇంటి వద్ద నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ లో ఎరువులు బుక్ చేసుకునే విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న ప్రతి షాప్ వద్ద డీలర్ అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు.