ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
NEWS Sep 01,2026 10:35 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.