ఓ పక్క ఉల్లి ధరలు పెరుగుతూ సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ఓ వ్యక్తి ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల పాలన పూర్తి చేసుకుందని ఆ మైలురాయిని పురస్కరించుకొని వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి నగరంలోని చౌరస్తా ప్రాంతంలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా 1000 కిలోల ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉల్లిగడ్డలను తీసుకున్నందుకు ప్రజలు పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.