నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: మేయర్
NEWS Sep 01,2026 10:33 pm
కరీంనగర్: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. నగరంలో రోడ్ల మరమ్మతులు, తాగునీరు, ప్రత్యేక లైటింగ్, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు పూర్తి చేయాలని, అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.