కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
NEWS Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ను కూడా ఆమె కోరారు. ఇటీవల రేవంత్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు T PCC షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఆమె వివరణ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖతో పాటు వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన నివేదికను అధిష్ఠానానికి టీపీసీసీ పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లడం.. కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.