31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి సీఎంను అయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొగల్తూరుకు ఎన్నో సార్లు వచ్చా. ఉమ్మడి రాష్ట్రంలో నేను తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఇవాళే. అంతకుముందు ఎన్నో రాజకీయ మార్పులు చూశా. నాపై మీరు చూపించే అభిమానం.. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను’’ అని చంద్రబాబు అన్నారు.