అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
NEWS Sep 01,2026 01:12 pm
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే సొంతంగా వండుకోవాలని అనడంపై మండిపడ్డారు. రూ.కోట్లతో మైదానం, గ్యాలరీలు నిర్మిస్తున్న అధికారులు.. 24/7 లైబ్రరీ, హాస్టల్ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రేపు 2వ సర్కిల్, మెయిన్ గేట్ వద్ద నిర్వహించే ఆందోళనకు పిలుపునిచ్చారు.