నిధులు మంజూరు చేయాలని వినతి
NEWS Sep 01,2026 01:11 pm
రాయికల్: అల్లీపూర్ కుమ్మరి సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సంఘ భవనం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే బోరు, దానికి సంబంధించిన మోటార్క్ రూ.1.50వేలు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని సర్పంచ్ గౌతమి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.