సుదీర్ఘ సేవలందించిన అధికారులకు సన్మానం
NEWS Sep 01,2026 12:03 am
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సై ఖాజా ఫయాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ ఖాజా పాషాలను సోమవారం సీపీ గౌష్ ఆలం ఘనంగా సన్మానించారు. బాధ్యతలను నిబద్ధతతో పూర్తిచేసి విరమణ పొందడం అభినందనీయమన్నారు. అధికారుల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షస్తూ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇతర అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.