కరీంనగర్ త్రీటౌన్ పీఎస్ను తనిఖీ చేసిన సీపీ
NEWS Sep 01,2026 12:03 am
కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ను సోమవారం సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తును పరిశీలించారు. సాంకేతిక వేదికల ఆధారంగా కేసుల పరిష్కారం వేగవంతం చేయాలని, సైబర్ నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు.