ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం..
రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
NEWS Aug 31,2026 07:36 pm
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. శ్రీనివాస సర్కిల్ వద్ద ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిషనర్ గంగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఎమ్మిగనూరు తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.