గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలి
NEWS Sep 01,2026 12:04 am
కరీంనగర్ : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ డా. బండారి రాజ్కుమార్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.